Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ మండపానికే వచ్చిన కరోనా రిపోర్ట్.. అంతా షాక్.. వరుడికి..?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (21:23 IST)
పెళ్లిపీటల మీద ఉన్న సమయంలోనే వరుడికి కరోనా పాజిటివ్‌ అని తెలిసిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. దీంతో నూతన దంపతులను క్వారంటైన్‌లో ఉంచగా, పెళ్లికి వచ్చిన వారందరికీ కొవిడ్‌ టెస్టులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం.. చంపావత్, ఛేరా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో వుంటున్నాడు.
 
పెళ్లికుదరడంతో స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే, ఇంటికి వస్తోన్న సమయంలో దగ్గరలోని చంపావత్‌ పట్టణంలో ఆ యువకుడు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. నమూనాలు ఇచ్చి ఇంటికి వెళ్లిన యువకుడు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడు. 
 
చివరకు పెళ్లివేడుక జరుగుతున్న సమయంలోనే అధికారులు కొవిడ్‌ రిపోర్టును నేరుగా మండపానికే తీసుకొచ్చారు. దీనిలో వరుడికి కొవిడ్‌ పాజిటివ్‌ తేలిన విషయాన్ని అధికారులు వారికి వెల్లడించారు. దీంతో ఆ వేడుకకు హాజరైనవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
 
అయితే, కోవిడ్‌ నిబంధనల ప్రకారం, మిగిలిన వివాహ ఆచారాలను పూర్తిచేసిన అనంతరం నవదంపతులను క్వారంటైన్‌కు పంపించారు అధికారులు. వివాహానికి హాజరైన గ్రామస్థులకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని స్థానిక మండల తహసీల్దార్‌ పంకజ్‌ చందోలా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments