Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. గంగానదిలో కార్తీక పౌర్ణమికి స్నానాల్లేవ్..

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (19:53 IST)
కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ నెల 30వ తేదీన రానుంది. ఈ సందర్భంగా ప్రజలు పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తారు. అయితే ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు గంగానదిలో స్నానాలు చేసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈసారి పుణ్యస్నానాలను నిషేధించినట్టు అధికారులు ప్రకటించారు.
 
పుణ్యస్నానాల కోసం ప్రజలు పెద్దఎత్తున ఘాట్లలో గుమికూడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897తో పాటు విపత్తుల నిరోధక చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామన్నారు.
 
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏటా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం గంగానదీ తీరానికి వస్తారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు నదీస్నానాలు ఆచరించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు హరిద్వార్ జిల్లా కలెక్టర్ సి. రవిశంకర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments