Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 578 ఒమిక్రాన్ కేసులు - కొత్త మార్గదర్శకాలు రిలీజ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:23 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నమోదయ్యే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 578 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్  సంబంధిత నిబంధనలను వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. 
 
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందు చూపు, డేటా విశ్లేషణతోపాటు స్థానిక, జిల్లా స్థాయిల్లో పకబందీ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
ముఖ్యంగా, పండగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు అవసరానికి అనుగుణంగా నిబంధనను విధించవచ్చని కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments