Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి : 25 దేశాల్లో కేసులు నమోదు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:30 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ శవేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే 25కు పైగా దేశాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. తాజాగా నైజీరియాలో కూడా తొలి కేసు నమోదైంది. అలాగే, యూరోపియన్ యూనియన్‌లోని 11 దేశాల్లో ఏకంగా 44 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ఎట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి బుధవారం ఏకంగా 3476 భారత్‌లోకి అడుగుపెట్టారు. వీరికి పరీక్షలు చేయగా, ఆరుగురుకి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కేంద్రం ఎయిర్ పోర్టుల్లో అలెర్ట్ ప్రకటించింది.
 
అంతేకాకుండా, ఈ వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు పాకిపోయింది కొత్త వేరియంట్ గురించి ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా అప్రమత్తం చేసింది. అక్టోబరులో తొలి కేసు సౌతాఫ్రికాలోనే వెలుగు చూసింది. సౌతాఫ్రికా నుంచి నైజీరియాకు వచ్చిన వారిలో ఒకరికి ఈ వైరస్ సోకినట్టు తేలిందని నైజీరియా జాతీయ ప్రజారోగ్య సంస్థ తెలిపింది. 
 
మరోవైపు, అత్యంత కఠిన ఆంక్షలు అమలయ్యే సౌదీ ఆరేబియాలో కూడా మరో కేసు నమోదైంది. ఇదిలావుంటే ఎట్ రిస్క్ దేశాల నుంచి భారత‌కు 3476 మంది వచ్చారు. వీరందరికీ నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అయితే, వీరికి సోకింది ఒమిక్రానా? లేదా వేరే వేరియంటా? అనేది నిర్ధారణ కావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments