Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌ రోడ్‌ పరిశీలనకు ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:23 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులపై కొండచరియలు విరిగిపడి ధ్వంసమవుతున్నాయి. బుధవారం పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడటంతో రెండో కనుమ రహదారి బాగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో భారీ వాహనాలను నిలిపివేశారు. పైగా దెబ్బతిన్న ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు యుద్ధప్రాతిపదిన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ దెబ్బతిన్న రోడ్డు మార్గాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం గురువారం పరిశీలించనుంది. ఈ నిపుణుల బృందంలో కేఎస్ రావు, నరసింహారావు, టీటీడీ రిటైర్డ్ సీఈ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
కాగా, గత 1973లో రెండో ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు. అయితే, భారీ వర్షాల సమయంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడి రోడ్డు దెబ్బతింటుంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 13 ప్రాంతాల్లో కొండ చరియలు, పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడుతున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా 16 కిలోమీటరు వద్ద పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు బాగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments