Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌ రోడ్‌ పరిశీలనకు ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (11:23 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులపై కొండచరియలు విరిగిపడి ధ్వంసమవుతున్నాయి. బుధవారం పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడటంతో రెండో కనుమ రహదారి బాగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో భారీ వాహనాలను నిలిపివేశారు. పైగా దెబ్బతిన్న ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు యుద్ధప్రాతిపదిన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ దెబ్బతిన్న రోడ్డు మార్గాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం గురువారం పరిశీలించనుంది. ఈ నిపుణుల బృందంలో కేఎస్ రావు, నరసింహారావు, టీటీడీ రిటైర్డ్ సీఈ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
కాగా, గత 1973లో రెండో ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు. అయితే, భారీ వర్షాల సమయంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడి రోడ్డు దెబ్బతింటుంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 13 ప్రాంతాల్లో కొండ చరియలు, పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడుతున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా 16 కిలోమీటరు వద్ద పెద్ద బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు బాగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments