Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా... 24 గంటల్లో 131 మంది ఖాకీలకు సోకింది...

Webdunia
గురువారం, 28 మే 2020 (17:09 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాను మరింతగా వ్యాప్తి చెందకుండా అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులను సైతం వదిలిపెట్టడం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో అయితే, ఇప్పటివరకు ఏకంగా 2095 మంది ఈ వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. 
 
వాస్తవానికి మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో పోలీస్ శాఖలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు పోలీసులు కొవిడ్‌-19తో మృతి చెందారు. ఇప్పటి వరకు 2095 మంది పోలీసులకు కరోనా సోకింది. మృతుల సంఖ్య 22కు చేరింది. 897 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 56,948 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 17,918 మంది కోలుకున్నారు. రెండో స్థానంలో తమిళనాడు(18,545 పాజిటివ్‌ కేసులు), మూడో స్థానంలో ఢిల్లీ(15,257 పాజిటివ్‌ కేసులు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments