Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లక్షకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:08 IST)
దేశంలో కరోనా వైరస్ మరోమారు విశ్వరూపం ప్రదర్శించింది. రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయిలో సాగుతోంది. ఫలితంగా కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 93 వేలుగా నమోదయ్యాయి. 
 
కొత్త కరోనా కేసులు వచ్చిన తర్వాత, తిరిగి ఐదు మాసాల తర్వాత ఆ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదేసమయంలో నాలుగు నెలల తార్వాత మరణాల సంఖ్య 500ను తాకింది. 
 
మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని, అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి, కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
 
కాగా శుక్రవారం నాడు ఇండియాలో 89 వేల రోజువారీ కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో శుక్రవారం మిగతా అన్ని దేశాల కన్నా, భారత్‌లోనే అధిక సంఖ్యలో నమోదు కావడం గమనార్హం. యూఎస్‌లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదయ్యాయి.
 
కాగా, కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు రావడం గమనార్హం. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments