Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒప్పో నుంచి ఎఫ్ 19 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్.. ఏప్రిల్ 6న విడుదల

ఒప్పో నుంచి ఎఫ్ 19 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్.. ఏప్రిల్ 6న విడుదల
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:02 IST)
OPPO F19
మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఒప్పో సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. గత నెలలోనే ఎఫ్ 19 ప్రో, ఎఫ్ 19 ప్రో ప్లస్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేసిన ఒప్పో.. తాజాగా, ఎఫ్-19 పేరుతో మూడో స్మార్ట్‌ఫోన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్​లో ఏప్రిల్ 6న​ విడుదల చేయనుంది. బడ్జెట్​ రేంజ్​లోనే దీనిలో అద్భుతమైన ఫీచర్లను అందించింది. 
 
ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​లో ఒప్పో ఎఫ్​ 19 ఫీచర్లను వెల్లడించారు. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరాలు, హోల్-పంచ్ డిస్​ప్లే డిజైన్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్​ఫోన్​ భారత్​తో పాటు శ్రీలంకలో కూడా విడుదల కానుంది.
 
ఒప్పో ఎఫ్ 19 ఇండియా వేరియంట్ ఫుల్​-హెచ్‌డి ప్లస్​ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని, ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిలోని బ్యాటరీతో కేవలం 72 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 
 
ఈ స్మార్ట్​ఫోన్​ 33డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్​ ఇస్తుంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్​తో 5.55 గంటల వాయిస్ కాలింగ్ లేదా రెండు గంటల యూట్యూబ్​ యాక్సెస్​ చేయవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో ఎఫ్ 19 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి వివాహితతో ప్రియుడు, పక్కగదిలో దాక్కున్న మహిళ భర్త ఏం చేశాడంటే...