Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలు... నాలుకపై గాయాలు కూడా...

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:21 IST)
కరోనా వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలను వైద్యులు తాజాగా గుర్తించారు. నాలుకపై గాయాలు, నాలుకపై దురద, నోరు ఎండిపోయినట్టు ఉండడం కూడా కరోనా లక్షణాలు కావొచ్చని అంటున్నారు. 
 
సాధారణంగా కరోనా వైరస్ సోకితే జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, వాసన గుర్తించలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలేనని ఇప్పటివరకు భావిస్తున్నారు. 
 
కానీ, కరోనా వైరస్ ప్రభావం నాలుకపైనా పడుతోందని వైద్య నిపుణులు గుర్తించారు. నాలుకపై గాయాలు, నాలుకపై దురద, నోరు ఎండిపోయినట్టు ఉండడం కూడా కరోనా లక్షణాలు కావొచ్చని అంటున్నారు. 
 
ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారిలో విపరీతమైన నీరసం ఉంటుందని తెలిపారు. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
నాలుకకు సంబంధించిన లక్షణాలతో కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో అత్యధిక శాతం కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఈ లక్షణాలు కరోనా కొత్త వేరియంట్ల కారణంగానే ఏర్పడుతుండొచ్చని వారు అభిప్రాయపడ్డారు. 
 
జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్ ఈ కొత్త లక్షణాలు కలిగించే అవకాశం ఉందని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ బాధితులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments