Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 17న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
శనివారం, 17 జులై 2021 (11:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల పెద్దగా కనిపించడం లేదు. ఒక రోజున 40 వేలకు పైగా కేసులు నమోదైతే మరోరోజు 40 వేలకు దిగువన నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,079 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది.
 
ఇకపోతే, కోవిడ్ బాధితుల మరణాల విషయానికొస్తే... శుక్రవారం 560 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,091కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,24,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు 97.31 శాతంగా ఉంది.
 
ఇదిలావుంటే, దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 44,20,21,954 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శుక్రవారం ఒక్క రోజే 19,98,715 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments