అర్థరాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన మహిళ... వెనుకనే గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్

Webdunia
శనివారం, 17 జులై 2021 (10:58 IST)
కొన్ని ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారుతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్లో కామంతో కళ్లుమూసుకుని ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అర్థరాత్రిపూట మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన మహిళను ఓ కానిస్టేబుల్ వెనుకనే వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. దీంతో బిత్తరపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో కానిస్టేబుల్‌ పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగరులో కానిస్టేబుల్‌ మహబూబ్‌ నివాసం ఉంటున్నాడు. ఈయన ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13న అర్థరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చింది. 
 
అయితే, ఆ మహిళపై ఎప్పటి నుంచో కన్నేసివున్న కానిస్టేబుల్... ఇదే అదునుగా భావించి ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. 
 
పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్‌ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments