Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 28న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 24 గంట‌ల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే నిన్న‌ 689 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు.
 
మరో 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 
 
కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో 689 మంది క‌రోనాతో మృతి చెందారు. గత 81 రోజుల్లో ఇదే అత్యల్పం. దీనికిముందు ఏప్రిల్ 7న 685 మంది కరోనా కార‌ణంగా క‌న్నుమూశారు. 
 
దేశంలో ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారిగా జూన్ 27 న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి కన్నా తక్కువగా నమోదైంది. గత వారంలో కరోనా కారణంగా సంభ‌వించిన మరణాలలో 45 శాతం క్షీణత క‌నిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments