Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 28న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 24 గంట‌ల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే నిన్న‌ 689 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు.
 
మరో 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 
 
కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో 689 మంది క‌రోనాతో మృతి చెందారు. గత 81 రోజుల్లో ఇదే అత్యల్పం. దీనికిముందు ఏప్రిల్ 7న 685 మంది కరోనా కార‌ణంగా క‌న్నుమూశారు. 
 
దేశంలో ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారిగా జూన్ 27 న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి కన్నా తక్కువగా నమోదైంది. గత వారంలో కరోనా కారణంగా సంభ‌వించిన మరణాలలో 45 శాతం క్షీణత క‌నిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments