Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 28న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:21 IST)
దేశంలో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల్లో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 24 గంట‌ల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే నిన్న‌ 689 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు.
 
మరో 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 
 
కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో 689 మంది క‌రోనాతో మృతి చెందారు. గత 81 రోజుల్లో ఇదే అత్యల్పం. దీనికిముందు ఏప్రిల్ 7న 685 మంది కరోనా కార‌ణంగా క‌న్నుమూశారు. 
 
దేశంలో ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారిగా జూన్ 27 న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి కన్నా తక్కువగా నమోదైంది. గత వారంలో కరోనా కారణంగా సంభ‌వించిన మరణాలలో 45 శాతం క్షీణత క‌నిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments