Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 606 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11,980 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 606 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. 
 
అలాగే, మరో 84 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,858 ఉండగా, ఇందులో 23,03,522 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 14730 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో మొత్తం 3116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 5559మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ఇపుడు దేశంలో 38,069 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,37,072గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments