Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్-కరోనా లక్షణాలు నెలలు తరబడి వుంటాయట!

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (19:25 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు అంత సులభం వదిలిపోవని.. రోజులు గడిచినా.. ఆ లక్షణాలు నెలల తరబడి వుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజులు గడుస్తున్న కొద్ది కొంతమందిలో అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని ఆ అధ్యయనం తెలిపింది. క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ జర్నల్‌లో వెల్లడించారు. 
 
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తమ పరిశోధనలో తేలినట్లు ఓ శాస్త్రవేత్త తెలిపారు.
 
మార్చి నుంచి జూన్ మధ్యలో స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలు ఉన్న 150 మందిపై ఈ అధ్యయనం జరిపారు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, జ్వరం, జలుబు సహా కరోనా లక్షణాల్లో ఏదో ఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు.
 
ఇందులో 66.66 శాతం మందిలో కరోనా నిర్ధారణ అయిన 60 రోజుల తరువాత కూడా లక్షణాలులేవని.. మిగిలిన 33.33 శాతం మందిలో తొలినాళ్లతో పోలిస్తే ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతాయని అందులో పాల్గొన్న పరిశోధకులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments