Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ: 24 గంటల్లో 20వేల కేసులకు పైగా నమోదు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (23:12 IST)
దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతుంది. కారణం కేరళలో కరోనా విజృంభించడమే. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. 
 
అయితే మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు, మొత్తం మరణాల సంఖ్య 16,457కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 17,761 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,60,804కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments