Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విలయతాండవం : కొత్తగా 6341 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (19:05 IST)
సౌత్ ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. కానీ, ఏపీ మాత్రం ఈ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇందులో 6,341 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. 
 
అలాగే, కరోనాతో గత 24 గంటల్లో 57 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 18,39,243కు  కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 67,629 యాక్టివ్ కేసులున్నాయి.
 
మరోవైపు ఏపీలో కర్ఫ్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కొవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. 
 
సోమవారం నుంచి ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments