Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కర్ఫ్యూను పొడిగింపు.. మినహాయింపు కూడా..?

Advertiesment
Andhra pradesh
, శుక్రవారం, 18 జూన్ 2021 (14:19 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగించాలని సర్కారు భావిస్తోంది. మే 5 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం దశల వారీగా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈ నెల 20తో ముగియనుంది. 
 
గతంలో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కర్ఫ్యూ సమయాన్ని కుదించనున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ నిర్వహించే సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ అమల్లో ఇవ్వాల్సిన మినహాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 
 
కరోనా కట్టడి కోసం నెల రోజులకు పైగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని మరికొద్ది రోజులు పొడిగించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న సడలింపులకు తోడు మరికొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
 
దీంతో ఈ నెల 21 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కర్ఫ్యూను మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహ్వేశ్వరికి నోటీసులు