Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 65 వేలు దాటిన క్రియాశీలక కేసులు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:56 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయి. ఆదివారం లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 10 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 7178గా ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 78342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 7178 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో 65683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,31,345కు చేరింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఎక్స్ బీబీ 1.16 రకం వేరియంట్ కారణమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించినప్పటికీ ఈ వేరియంట్ అంత శక్తిమంతమైనది కాదని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించి వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

Sidhu : జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments