Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా 543 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. 
 
ఇందులో 3,39,98,278 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో మొత్తం 8774 పాజిటిప్ కేసులు నమోదు కాగా, 9481 మంది ఈ వైస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 543 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శనివారం ఏకంగా 4741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రికవరీ రేటు 98.34 శాతంగావుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments