Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని? - పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. దేశంలో కొత్తగా మరో 18,833 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881కు చేరింది. 
 
ప్ర‌స్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,46,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల క‌నిష్టానికి చేరాయి. ఇక క‌రోనా నుంచి కొత్త‌గా 24,770 మంది కోలుకున్నారు. మంగళవారం క‌రోనాతో 278 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య‌ 4,49,538కి చేరింది. 
 
మరోవైపు, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) గట్టి హెచ్చరిక చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది.
 
ముఖ్యంగా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరో రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
 
మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ సందర్భంగా, ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments