Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా 15 వేల కోవిడ్ కేసులు - దేశంలో 90 వేలు - ఫోర్త్ వేవ్ తప్పదా?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:41 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 90 వేలు దాటిపోయాయి.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో గత 24 గంటల్లో మొత్తం 15940 కేసులు కొత్తగా నమోదు కాగా, వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. 
 
24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొత్తగా నమోదైన కేసులు 15,940 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు ఉన్నాయి. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. అలాగే, 20 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి  సంఖ్య 12425గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసు సంఖ్య 91,779గా ఉంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments