దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:56 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్పల్పంగా పెరిగాయి. గురువారం వెల్లడించిన కేసులతో పోల్చుకుంటే శుక్రవారం వెల్లడైన కేసుల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 1,109 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నాటి కేసులతో పోల్చుకుంటే 76 కేసులు అధికం. అదేసమయంలో కరోనా వైరస్ బాధితుల్లో 43 మంది చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 36 మంది మరణించడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,492 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. అదేసమయంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,00,002 మంది కోలుకున్నారు. మరో 5,21,573 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 185 కోట్ల కరోనా డోసులను వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments