Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసు - ఆందోళనలో ప్రజలు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (16:23 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఏడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గత 24 గంటల్లో 7,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 7,240 కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 మంది చనిపోగా, మరో 3,791 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే ఇపుడు దేశంలో 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,32,05,106కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,26,44,092 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. 
 
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే 8813 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేరళలో 2193, ఢిల్లీలో 622, కర్నాటకలో 471, హర్యానాలో 348 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments