Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ముందే చెప్పి వుంటే తప్పించుకునేవాళ్లం: ట్రంప్ అసహనం

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (20:32 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించడం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచంలోని ఒక్కొక్క దేశానికి పాకుతూ పోతోంది. నియంత్రణ చర్యలు తీసుకునేలోపే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటలీలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
 
ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి చైనా ముందే చెప్పాల్సిందని ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. చైనా ఈ వైరస్ విధ్వంసకరమైనదనీ, దాని లక్షణాలను పూర్తిగా చెప్పి ప్రపంచ దేశాలను జాగృతం చేసి వున్నట్లయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదన్నారు.
 
కరోనా వైరస్‌పై చైనా ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో పాటు తగిన సహకారం అందించనందుకు తాను ఎంతగానో కలత చెందానని ట్రంప్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఐతే చైనా అంటే తనకు ఇష్టమని చెప్పిన ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments