Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ముందే చెప్పి వుంటే తప్పించుకునేవాళ్లం: ట్రంప్ అసహనం

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (20:32 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించడం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచంలోని ఒక్కొక్క దేశానికి పాకుతూ పోతోంది. నియంత్రణ చర్యలు తీసుకునేలోపే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటలీలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
 
ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి చైనా ముందే చెప్పాల్సిందని ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. చైనా ఈ వైరస్ విధ్వంసకరమైనదనీ, దాని లక్షణాలను పూర్తిగా చెప్పి ప్రపంచ దేశాలను జాగృతం చేసి వున్నట్లయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదన్నారు.
 
కరోనా వైరస్‌పై చైనా ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో పాటు తగిన సహకారం అందించనందుకు తాను ఎంతగానో కలత చెందానని ట్రంప్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఐతే చైనా అంటే తనకు ఇష్టమని చెప్పిన ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments