రూ.399లకే కరోనా టెస్ట్ కిట్.. ఢిల్లీ ఐఐటీ అదుర్స్

Webdunia
గురువారం, 16 జులై 2020 (12:33 IST)
corona Kit
ఢిల్లీకి చెందిన ఐఐటీ కరోనా టెస్ట్ కిట్ కరోష్యూర్‌ను తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కోవిడ్19 టెస్ట్ కిట్ అని తెలిపింది. కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్ కరోష్యూర్ కిట్‌ను ఆవిష్కరించారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చౌక ధరలో కరోనా టెస్ట్ కిట్ ఆవిష్కరించడంపై ఢిల్లీ ఐఐటీ హర్షం వ్యక్త చేసింది. 
 
ఈ కరోనా కిట్‌ ధర కేవలం రూ.399 అని, ఆపై ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్, ల్యాబ్‌ చార్జీలు కలిపినా మొత్తం ధర రూ.650 అవుతుందని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కిట్లతో అతి తక్కువ ధర కిట్ ఇదేనన్నారు. 
 
ఈ కరోష్యూర్ కేవలం 3 గంటల్లోనే కోవిడ్19 టెస్టు ఫలితాలు అందించనుంది. కరోష్యూర్ కిట్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియాలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కరోనా కిట్‌ అత్యధిక స్కోరుతో ఐసీఎంఆర్ అనుమతి పొందిందని, కచ్చితత్వంగా కూడిన ఫలితాలు వస్తాయంటూ డీసీజీఐకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments