Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టిన కరోనా.. మణిపూర్‌లో తొలికేసు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (10:58 IST)
ఈశాన్య భారతంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. ఫలితంగా మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే బ్రిటన్‌ నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. 
 
యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్‌ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments