Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (14:35 IST)
ప్లాస్మా థెరపీ వల్ల కరోనా మరణాలు తగ్గించవచ్చంటూ నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దానం చేసే ప్లాస్మా వల్ల ప్రాణాలు నిలబడతాయనే ఉద్దేశంతో ప్లాస్మా దానానికి పలువురు ముందుకొచ్చారు .అయితే తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
 
14 రాష్ట్రాలలోని 39 ఆస్పత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మరణాలను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేక పోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరణాలతో పాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేక పోయిందని పేర్కొన్నారు.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది.
 
అధ్యయనంలో వెల్లడైన విషయాలను టాస్క్ పోర్స్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించిన అనంతరం ప్లాస్మా థెరపీ విధానాన్ని కొనసాగించాలా, వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని భార్గవ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments