Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిన కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం... గోవాకు ఎయిమ్స్ వైద్య బృందం

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (19:51 IST)
కరోనా వైరస్ బారినపడిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఈయన ఆయుష్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఈయనకు కరోనా వైరస్ సోకిన తర్వాత గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నిపుణుల బృందం గోవా బయల్దేరింది. మణిపాల్ వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ వర్గాలు నిపుణులను పంపాయి. 
 
ఇదే అంశంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, కేంద్ర మంత్రి నాయక్‌కు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయనీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్య బృందం గోవాకు వస్తుందన్నారు. ఈ వైద్య బృందం పరిశీలించిన తర్వాత నాయక్‌ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించాలా లేదా అనేది నిర్ధారిస్తారని తెలిపారు. 
 
అంతేకాకుండా, గోవాలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments