Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా కేసులు.. కొత్త రికార్డు.. 3,700 మంది మృతి

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (23:41 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో రికార్డులపై రికార్డులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో కొత్త కేసులు 2,50,000 దాటగా మరణాలు 3,700 దాటాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు వెల్లడించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,07,291గా వుంది. గత నెల రోజులుగా అమెరికాలో కొవిడ్‌ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. 
 
ప్రస్తుతం ఈ వైరస్‌తో ఆస్పత్రి పాలైన వారి సంఖ్య 1,13,000గా వుంది. అమెరికాలో కరోనా గణాంకాలకు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో అంకెలకు అస్సలు పొంతన లేకుండా వుంది. అమెరికా జనాభాలో ఐదు శాతం మందికి లేదా దాదాపు కోటీ 70లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. కాగా అమెరికా ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌ ఆరంభించింది. ఈ వారం చివరికల్లా 29లక్షల డోసులను సేకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్‌ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలోగా అమెరికా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పకూలేలా వుందని అమెరికా సిడిఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ ఇప్పటికే హెచ్చరించారు. బైడెన్‌ వచ్చే వారం వ్యాక్సిన్‌ తీసుకోనుండగా, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ దంపతులు శుక్రవారం టీకా వేయించుకోనున్నారని వైట్‌హౌస్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments