Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఆటలు కాదు.. ఓసారి గెలిచి మరోసారి ఓడిన యువ డాక్టర్!

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:21 IST)
కరోనా వైరస్ సోకిన రోజులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తగా వ్యవహరించినా పైలోకాలకు వెళ్లక తప్పదు. ఈ మాటలు ఎవరో చెప్పలేదు. సాక్షాత్ ఓ యువ వైద్యుడి విషయంలో అనుభవపూర్వకంగా నిరూపితమైంది. కరోనా వైరస్ బారినపడిన ఆ వైద్యుడు... తొలుత విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ వైరస్ బారినపడి మృత్యువొడిలోకి చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా బద్వేల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చింది. బద్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడుగా నందకుమార్ పని చేస్తున్నారు. ఈయన కరోనాతో కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. నందకుమార్ వయసు 28 సంవత్సరాలు. ఆయన మూడు నెలల కిందట కరోనా బారినపడి కోలుకున్నారు. ఆపై తన విధులకు హాజరవుతున్నారు. 
 
అయితే, ఇటీవలే మళ్లీ కరోనా సోకింది. రెండు వారాల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఇంటివద్దే చికిత్స పొందారు. తగ్గకపోవడంతో కడప రిమ్స్ కు వెళ్లారు. 
 
అక్కడ్నించి తిరుపతి స్విమ్స్‌కు, ఆపై చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ నందకుమార్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పనిచేసిన ఆసుపత్రిలో సిబ్బంది, బంధుమిత్రులు తీవ్రవిచారానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments