Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:00 IST)
ముంబైలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణిస్తే ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడని సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ముంబైలోని కుర్లాలోని హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరా విషయం బయటకు రావడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పప్పు ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కుర్లాలోని న్యూ నూర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగానే అతడు కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం వద్ద డబ్బులు కట్టించుకొని గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇంటికి పంపించారు. 
 
అనుమానంతో వ్యాధి లక్షణాలను పరిశీలించగా అతనికి కరోనా అని తేలింది. దీంతో వైద్యులు సరిగా పరీక్షలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మృతుని కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments