దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (11:06 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,476 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
 
అలాగే, గత 24 గంటల్లో ఈ వైరస్ బారినపడిన వారిలో 158 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 9,754 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 59,442 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, ఈ బాధితులంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 4,23,88,475 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ రెండో అల ప్రారంభమయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి రెండో వేవ్ ప్రారంభమయ్యేందుకు 4 నుంచి 5 నెలల సమయం పట్టింది. కరోనా థర్డ్ వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తున్నారు. 
 
అయితే, కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు మాత్రం జూన్‌లో నాలుగో దశ కరోనా వేవ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ఫోర్త్ వేవ్ జూన్‌లో ప్రారంభమై అక్టోబరు వరకు కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments