Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (11:06 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,476 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
 
అలాగే, గత 24 గంటల్లో ఈ వైరస్ బారినపడిన వారిలో 158 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 9,754 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 59,442 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, ఈ బాధితులంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 4,23,88,475 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ రెండో అల ప్రారంభమయ్యేందుకు ఆరు నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి రెండో వేవ్ ప్రారంభమయ్యేందుకు 4 నుంచి 5 నెలల సమయం పట్టింది. కరోనా థర్డ్ వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని భావిస్తున్నారు. 
 
అయితే, కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు మాత్రం జూన్‌లో నాలుగో దశ కరోనా వేవ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ ఫోర్త్ వేవ్ జూన్‌లో ప్రారంభమై అక్టోబరు వరకు కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments