Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విజృంభణ, కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:29 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల 67 వేలను దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 64,531 కేసులు నమోదు కాగా 1092 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60,091 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,67,273 కేసులు నమోదయ్యా యి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,76,514 ఉండగా 20,37,870 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలాఉండగా 52,889 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితులు రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.91 శాతానికి మరణాల రేటు తగ్గింది. కాగా యాక్టివ్ కేసుల శాతం 24.45 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,01,518 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,17,42,782కు చేరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments