Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వినాయక చవితి ఊరేగింపులు వద్దు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:53 IST)
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఏపీలో ఎలాంటి సడలింపు లేకుండా కరోనా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.
 
వినాయక చవితి సందర్భంగా ఊరేగింపులను నివారించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పండుగను వారివారి ఇళ్లలో పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే పెళ్లిళ్లు, బహిరంగ సభలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపారు.
 
అన్ని విద్యా సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించేలా చూడాలని జగన్ అధికారులను కోరారు. టీకా విషయానికొస్తే, వైరస్‌ బారిన పడిన వారిపై కోవిడ్ అనంతర ప్రభావాలను మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వ్యక్తులపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments