Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19: ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు, వినాయక చవితి ఊరేగింపులు వద్దు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:53 IST)
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఏపీలో ఎలాంటి సడలింపు లేకుండా కరోనా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.
 
వినాయక చవితి సందర్భంగా ఊరేగింపులను నివారించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పండుగను వారివారి ఇళ్లలో పాటించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే పెళ్లిళ్లు, బహిరంగ సభలు నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపారు.
 
అన్ని విద్యా సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించేలా చూడాలని జగన్ అధికారులను కోరారు. టీకా విషయానికొస్తే, వైరస్‌ బారిన పడిన వారిపై కోవిడ్ అనంతర ప్రభావాలను మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వ్యక్తులపై వాటి ప్రభావాలను అధ్యయనం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments