Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టింగ్ ధర తగ్గింపు!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (08:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను సర్కారు మరోమారు పునఃపరిశీలన చేసింది. కరోనా టెస్టింగ్‌ కిట్ల ధరలు తగ్గడంతో కొవిడ్‌-19 టెస్ట్‌ ధరలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రూ.1000 ఉన్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.499కు తగ్గించింది. వీటీఎం, పీపీఈ కిట్‌తో కలిపి ఈ ధరను నిర్ణయించింది. కొత్త ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కాగా, కరోనా అనుమానితులు నేరుగా ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకుంటే రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు ల్యాబ్స్‌కు పంపించిన శాంపిల్స్‌కు మాత్రం రూ.475కే పరీక్ష చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన ల్యాబ్‌లలో మాత్రమే కరోనా పరీక్షలు చేయాలని స్పష్టంచేశారు. సవరించిన ధరల ప్రైవేటు హాస్పిటల్స్‌, ల్యాబ్స్‌ బయట ఖచ్చితంగా ప్రదర్శనకు ఉంచాలని పేర్కొన్నారు. కొత్త రేట్లు అమలయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యతను జిల్లాల డీఎంహెచ్‌వోలకు ప్రభుత్వం అప్పగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments