Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సర్కారుకు శుభవార్త : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ

జగన్ సర్కారుకు శుభవార్త : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ
, బుధవారం, 16 డిశెంబరు 2020 (08:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్‌ను కూడా బదిలీ వేశారు. ప్రస్తుత న్యాయమూర్తులను ఏకకాలంలో బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జీకే మహేశ్వరిని సిక్కింకు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు పంపుతున్నట్టు సమాచారం.
 
ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీని తెలంగాణకు, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా రానున్నట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ 23 జూన్ 2019 నుంచి సేవలు అందిస్తుండగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి 7 అక్టోబరు 2019 నుంచి సేవలు అందిస్తున్నారు.
 
జస్టిస్ చౌహాన్ తెలంగాణకు రెండో ప్రధాన న్యాయమూర్తి కాగా, జస్టిస్ మహేశ్వరి నవ్యాంధ్రకు తొలి ప్రధాన న్యాయమూర్తి. కాగా, కోల్‌కత్తా హైకోర్టులో 27 జూన్ 2011 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిని కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే యోచన ఉన్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిపై ఏపీ సర్కారు అనేక రకాలైన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ఆయన్ను బదిలీ చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఏపీ సర్కారు తీసుకున్న అనేక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను హైకోర్టు చీఫ్ జస్టీస్ తప్పుబడుతూ తీర్పులిచ్చిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? : టీడీపీ