Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులపై కరోనా పడగ... నానాటికీ పెరుగుతున్న కేసులు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:19 IST)
కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పగబట్టినట్టుగా ఉంది. ఎందుకంటే.. గత మూడు రోజులుగా పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత ముంబైలోనూ, ఆ తర్వాత చెన్నైలో విలేకరులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో విధులు నిర్వహించాలంటేనే వారు వణికిపోతున్నారు. 
 
తాజాగా చెన్నై నగరంలో పనిచేసే మరో 10 మంది జర్నలిస్టులకు పాజిటివ్‌ తేలడంతో ఆందోళన నెలకొంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే 50 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు.
 
నిజానికి మంగళవారం ఓ ప్రైవేట్ టీవీలో పని చేసే విలేకరుల్లో 27 మందికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో పది మందికి ఈ వైరస్ సోకింది. జర్నలిస్టులు వేగంగా వైరస్‌ బారిన పడుతుండడంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 
 
వారు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కార్యాలయాలకు వస్తే అక్కడి సిబ్బందికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న ఆందోళన నెలకొంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వహించే వారికి వైరస్‌ సోకకుండా ఏ చర్యలు చేపట్టాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments