కరోనా ప్రమాద ఘంటికలు... దేశ వ్యాప్తంగా 28 కేసులు

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (13:21 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందులో ఢిల్లీలో ఒక కేసు నమోదుకాగా, ఆగ్రాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణాలో ఒకటి, కేరళలో మూడు, 16 మంది ఇటలీ వాసులు, ఒక భారతీయ డ్రైవర్‌కు ఈ వైరస్ సోకినట్టు మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. 
 
ముఖ్యంగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా, 16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు. 
 
మొత్తం 21మంది పర్యాటకులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వీరందరినీ ఎయిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి. 

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments