Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుసలు కొడుతున్న ఒమిక్రాన్ వైరస్ - 961కి చేరిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:19 IST)
ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తు ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా చేసిన ప్రకటన మేరకు ప్రస్తుతం దేశంలో 961 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, రాజస్థాన్‌లో 69, గుజరాత్‌లో 97, కేరళలో 65, తెలంగాణాలో 62, తమిళనాడులో 45 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసులు కూడా గత రెండు రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం 13,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 268 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మంగళవారం నమోదైన 9,155 కేసులతో పోల్చితే బుధవారం నమోదైన కోవిడ్ కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఈ కేసులు కేవలం 6,242 మాత్రమే కావడం గమనార్హం. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 3900 కేసులు వెలుగు చూడగా, కేరళలో 2846 కేసులు, బెంగాల్‌లో 1089 కేసులు, ఢిల్లీలో 923, తమిళనాడులో 739 చొప్పున కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మినహా దేశ వ్యాప్తంగా 185 రాష్ట్రాల్లో కేసులు అంతకుముందు రెండు రోజులతో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments