Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒమిక్రాన్: 75శాతం మంది వర్క్ ఫ్రమ్ చేయాల్సిందే.. ఐటీ సంస్థలు

ఒమిక్రాన్: 75శాతం మంది వర్క్ ఫ్రమ్ చేయాల్సిందే.. ఐటీ సంస్థలు
, బుధవారం, 29 డిశెంబరు 2021 (12:26 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ నుంచి ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటే, మార్చి 2022 నాటికి, 60-70 శాతం కార్యాలయం నుండి పని చేయాలి. కొన్ని దేశాలలో కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా, హైదరాబాద్‌లోని ఐటి కంపెనీలు జనవరి, 2022 నుండి ప్రణాళిక ప్రకారం కార్యాలయాల్లో భౌతిక పని విధానాన్ని పునరుద్ధరించడానికి వేచి చూసే విధానాన్ని అవలంబిస్తున్నాయి. 
 
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైసీ) అధ్యక్షుడు ఎ భరణి కుమార్ వివరాల ప్రకారం, పెద్ద ఐటి కంపెనీల్లో సుమారు 5 శాతం ఐటి శ్రామిక శక్తి, మధ్యతరహా కంపెనీల్లో 30-60 శాతం, చిన్న కంపెనీల్లో 60-70 శాతం మంది తమ కార్యాలయాల నుండి పనిచేస్తున్నారు.
 
"ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ప్రారంభ దశలో ఉంది. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా దాని ప్రభావాన్ని మేము ఇంకా అర్థం చేసుకోలేదు, కాబట్టి ప్రస్తుతానికి మేము ఊహాగానాలు చేయదలుచుకోలేదు" అని భరణి అభిప్రాయపడ్డారు.
 
ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్ వంటి పెద్ద కంపెనీల్లోని ఉద్యోగులు ఇప్పటికే హైబ్రిడ్ మోడ్‌‌పై పనిచేస్తున్నారు.  25-30 శాతం మంది ప్రతిరోజూ రొటేషన్ ప్రాతిపదికన కార్యాలయానికి వస్తారు. 
 
ప్రస్తుత పరిస్థితి ఓమిరాన్ వేరియంట్ యొక్క ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటే, మార్చి 2022 నాటికి, 60-70 శాతం కార్యాలయం నుండి పని చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే 75 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వుంటుందని ఐటీ సంస్థలు ఓ నిర్ణయానికి  వచ్చినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ - అండగా ఉంటామంటూ హామీ