Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. వ్యాక్సిన్ పంపిణీలో రికార్డ్

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (10:18 IST)
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,02,11,342 మంది బాధితులు కోలుకున్నారు. 
 
మరో 1,52,419 మంది మహమ్మారి వల్ల ప్రాణాలొదిరారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 14,457 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ వల్ల మరో 145 మంది మృతిచెందారని వెల్లడించింది.
 
భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అన్ని దేశాలకు మార్గదర్శనం చేస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ను విజయవంతంగా పంపిణీ చేసి భారత్ ఆదర్శంగా నిలిచింది. 
 
తాజాగా కరోనా టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో టీకాను పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే ఇంత పకడ్బందీగా ప్రణాళిక బద్దంగా ఎక్కడా జరగలేదని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments