Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా విలయతాండవం : ఒకే రోజు 62 వేల కేసులు

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (12:34 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 62 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో 62538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,27,075కు చేరాయి. 
 
ఇందులో 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 886 మంది కరోనాతో మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. తాజాగా న‌మోద‌వుతున్న పాజ‌టివ్ కేసుల్లో దాదాపు 38 శాతం ఆంధ్రప్రదేశ్, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
 
ప్రస్తుతం ఇండియా కరోనా కేసుల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అమెరికా 49.91 లక్షల కేసులతో మొదటిస్థానంలో ఉండగా, 28.73 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రెజిల్ కంటే కూడా భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments