Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం : ఒకే గ్రామంలో 16 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన నిర్లక్ష్యం వల్ల మరో 16 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని బట్లమాగుటూరు అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ గ్రామంలో అనేక మందికి వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే, ఈయన వైద్యం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామానికి వెళుతూ వచ్చేవాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం చేసిన గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఈ వైద్యుడు కారణంగా 16 మంది గ్రామస్తులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సెకండ్ కాంటాక్టర్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments