Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (11:51 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా అధికమవుతున్న విషయం తెల్సిందే. గడిచిన 24 గంటల్లో 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గురువారం సంఖ్యతో పోల్చుకుంటే శుక్రవారం నాటికి 9 శాతం అధిక కేసులు నమోదైనట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, ఢిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 49,622 చేరింది. రికవరీ రేటు 98.70 శాతంగా నమోదైంది. 
 
కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది. తాజాగా ఉద్ధృతికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments