Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 8లక్షల మార్కును తాకిన కరోనా వైరస్.. రికవరీ రేటు పెరిగింది..

Webdunia
శనివారం, 11 జులై 2020 (10:49 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి.
 
519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 22,123 మంది కరోనాతో బాధపడుతూ మరణించారు.
 
ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని కేంద్ర సర్కార్ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments