Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 8లక్షల మార్కును తాకిన కరోనా వైరస్.. రికవరీ రేటు పెరిగింది..

Webdunia
శనివారం, 11 జులై 2020 (10:49 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి.
 
519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 22,123 మంది కరోనాతో బాధపడుతూ మరణించారు.
 
ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని కేంద్ర సర్కార్ వివరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments