Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 32,080 కేసులు.. 402 మంది మృతి

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (11:26 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం కంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. 
 
ఇందులో గత 24 గంటల్లో 36,635 మంది మహమ్మారి నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. కాగా, గత 24 గంటల్లో 402 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,41,360కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
దేశంలో మంగళవారం ఒకేరోజు 10,22,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో డిసెంబర్‌ 8 వరకు మొత్తం 14,98,36,767 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments