Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా పరిస్థితి...

దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా పరిస్థితి...
, బుధవారం, 9 డిశెంబరు 2020 (09:53 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య రోజుకు 30 వేలకు తగ్గడం లేదు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ మేరకు... గత 24 గంటల్లో 32,080 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,35,850కి చేరింది. ఇక గత 24 గంటల్లో 36,635 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 402 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,360కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,15,581 మంది కోలుకున్నారు. 3,78,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటివరకు మొత్తం 14,98,36,767 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం ఒక్కరోజులోనే 10,22,712 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 721 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 753 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,261కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1480కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,661 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 5,576 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో చైనాకు ప్రత్యామ్నాయం భారత్ మాత్రమే : బిల్ గేట్స్