Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. ఏపీలో లక్ష దాటింది.. తెలంగాణలో 1,473 కేసులు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (20:08 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,051 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,210 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరో 49 మంది మృతి చెందగా, ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,090కి పెరిగింది. తెలంగాణలో కోవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. 
 
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 9,817 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,955 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 471కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments