Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కోరల్లో నుండి మెల్లగా బయటపడుతున్న దేశ రాజధాని ఢిల్లీ

కరోనా కోరల్లో నుండి మెల్లగా బయటపడుతున్న దేశ రాజధాని ఢిల్లీ
, సోమవారం, 27 జులై 2020 (17:28 IST)
రాజధానిలో కోవిడ్ 19 పరిస్థితి మెరుగు పడిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 88 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 9 శాతం మంది మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, నమోదైన మొత్తం కేసులలో రెండు, మూడు శాతం మంది మాత్రమే మరణించారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదేవిధంగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలిపారు.
 
ఢిల్లీ మోడల్ గురించి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చర్చ జరుగుతుందని సీఎం అన్నారు. జూన్ నెలలో కోవిడ్ మరణాలు 44 శాతం తగ్గాయని, మరణాల రేటు జీరోకు వచ్చినప్పుడే ఉపశమనం అని అన్నారు. కాగా జూలై 16న ఢిల్లీ లోని పార్లమెంటు సభ్యులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతు ఉండటంతోనే కరోనా వైరస్‌తో పోరాడే ఢిల్లీ మోడల్ సాధ్యమైందని తెలిపారు.
 
ఇదిలావుంటే మార్చి 2న తొలి కేసు నమోదైన తర్వాత జూన్ 23న ఒకే రోజు అత్యధికంగా 3,947 కేసులు వచ్చాయి. అయితే అది సరిగ్గా నెలరోజులకు 1,349గా నమోదైంది. నెలరోజుల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేసుల్ని నియంత్రించాము. జూన్ నెలలో 36 శాతం ఉన్న రికవరీ రేటు, జూలై 25 నాటికి అది 88 శాతానికి పెరిగిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్ట్‌లూ సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కి ఇప్పుడు వెళ్ళండి: టీఎస్ హైకోర్టు