Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా పరుగు - లక్ష కేసులకు చేరువలో... దేశంలోనూ అంతే...

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:58 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదేసమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. అలాగే, 76,967 మంది డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,48,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments